

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ తెరకెక్కుతుండగా, ఆ తర్వాత మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’ కూడా లైన్లో ఉంది. ఇదిలా ఉండగా, కొంతకాలంగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి స్పందన రాకపోవడంతో అభిమానులు సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పుడు ఆ అనుమానాలకు తెరదించుతూ నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేయడం సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది.
నెల్సన్తో సినిమా ఖరారైందని, అందుకోసమే ముందుగానే అడ్వాన్స్ కూడా ఇచ్చామని నాగవంశీ వెల్లడించారు. అయితే ఈ కలయిక వెంటనే ప్రారంభం కాకపోయినా, సరైన సమయంలో తప్పకుండా పట్టాలెక్కుతుందని స్పష్టం చేశారు. దీంతో చాలా రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది పెద్ద శుభవార్తగా మారింది. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో కొంత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఈ కాంబినేషన్పై అంచనాలు మాత్రం ఇప్పటికే భారీ స్థాయికి చేరుకున్నాయి. యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో నెల్సన్ సినిమాలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో, ఎన్టీఆర్తో ఆయన చేయబోయే చిత్రం ఎలా ఉండబోతుందనే ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!