

సింగరేణి భరోసా యాత్రలో పాల్గొన్న మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు సింగరేణి కార్మికులను మోసం చేశాయని ఆరోపించిన ఆమె, సంస్థకు సుమారు రూ.54 వేల కోట్ల నష్టాలు వచ్చాయని విమర్శించారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.
తాడిచర్ల బొగ్గు గనిని వేలం కాకుండా నామినేషన్ విధానంలో సింగరేణికి కేటాయించడం సంస్థకు కీలక మలుపుగా మారిందని డీకే అరుణ తెలిపారు. దీంతో సుమారు రూ.2,500 కోట్ల భారం తప్పిందని, ఆ గనిలో 434 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పారు. దీని ద్వారా సింగరేణికి రూ.1.20 లక్షల కోట్ల ఆదాయం, ప్రభుత్వానికి రూ.30 వేల కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వమే కార్మికుల్లో విశ్వాసాన్ని నింపిందని, డబుల్ ఇంజన్ ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!