

భారత సైన్యం దేశీయ రక్షణ తయారీ సంస్థలైన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, నైబ్ డిఫెన్స్తో రూ.1,577 కోట్ల విలువైన కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం కింద మొత్తం 840 లాంగ్రేంజ్ దాడి డ్రోన్లను సైన్యానికి అందించనున్నారు. దేశీయంగా తయారైన ఈ డ్రోన్లు 100 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. శత్రు జోక్యాలను తట్టుకునేలా వీటిని రూపొందించినట్లు సమాచారం.
ఈ డ్రోన్ల ద్వారా సరిహద్దులకు అవతల ఉన్న లక్ష్యాలపై దూరం నుంచే దాడులు నిర్వహించే సైన్యం సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. మొత్తం ఆర్డర్ను వచ్చే 12 నెలల్లో సైన్యానికి అందించేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఈ ఒప్పందం భారత సాయుధ బలగాల రక్షణ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు దేశీయ రక్షణ ఉత్పత్తి రంగానికి, స్వదేశీ సాంకేతిక అభివృద్ధికి మరింత ఊతమివ్వనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!