
సినిమాలు

భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు ఆళ్లగడ్డ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్వశాంతి పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
తర్వాత నాలుగు రోడ్ల కూడలిలో పింగళి వెంకయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గ అధ్యక్షుడు అమీర్ బాషా మాట్లాడుతూ ఆయన సైనికుడు, ఉపాధ్యాయుడు, స్వాతంత్ర్య సమరయోధుడిగా చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. యువతకు ఆయన జీవితం ఆదర్శమని పేర్కొంటూ భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనాథ్ రెడ్డి, ఉపాధ్యాయులు ఇమ్రాన్, విజయ్ పాల్గొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!