
సినిమాలు

భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ ప్రైమరీ మార్కెట్లో ఐపీఓల సందడి మళ్లీ జోరందుకుంది. వచ్చే వారం మొత్తం 11 ఐపీఓలు ఇన్వెస్టర్ల కోసం సబ్స్క్రిప్షన్కు రానున్నాయి. వీటిలో రెండు మెయిన్బోర్డు ఐపీఓలు, తొమ్మిది ఎస్ఎంఈ ఐపీఓలు ఉన్నాయి. మార్కెట్లో పెట్టుబడిదారుల విశ్వాసం పెరగడంతో కొత్త కంపెనీలు మూలధనం సమీకరణకు ఆసక్తి చూపుతున్నాయి.
మెయిన్బోర్డు విభాగంలో ఆస్తా స్పింటెక్స్ ఐపీఓ జూన్ 29 నుంచి జూలై 1 వరకు అందుబాటులో ఉండగా, రూ.170 కోట్లు సమీకరించనుంది. న్యాక్ ప్యాకేజింగ్ ఐపీఓ జూలై 1 నుంచి 3 వరకు సబ్స్క్రిప్షన్కు రానుండగా, రూ.439.50 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే సమయంలో ఇప్పటికే సబ్స్క్రిప్షన్ పూర్తిచేసుకున్న తొమ్మిది కంపెనీలు వచ్చే వారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈతో పాటు ఎస్ఎంఈ ప్లాట్ఫారమ్లలో లిస్టింగ్ కానున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!