

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందుతున్న సుమారు 5,560 మంది ఎస్సీటీపీసీ కానిస్టేబుళ్లకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు విధుల్లో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలపై ఆయన సూచనలు చేశారు. నిజాయతీ, క్రమశిక్షణ, ఓర్పు వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు.
ప్రజలు పోలీస్ స్టేషన్ను ఆశ్రయంగా భావిస్తారని, ఫిర్యాదుదారుల సమస్యలను ఓర్పుతో విని, సహానుభూతితో స్పందించడం ద్వారా పోలీసులపై నమ్మకాన్ని పెంచవచ్చని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. చిరాకు, ఆవేశానికి దూరంగా ఉండాలని సూచిస్తూ, మానసిక ప్రశాంతత కోసం మంచి పుస్తకాలు, హాస్య రచనలు చదవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని 21 పోలీసు శిక్షణా కళాశాలల ప్రిన్సిపాళ్లు, కాకినాడ జిల్లా అధికారులు, సివిల్ మరియు ఏపీఎస్పీకి చెందిన సుమారు 5,560 మంది ట్రైనీ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!