

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత మళ్ల విజయప్రసాద్కు చెందిన నివాసాలు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్తో పాటు విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. రూ.3,000 కోట్లకు పైగా విలువైన చిట్ఫండ్ కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. బిహార్కు చెందిన ఈడీ బృందం ఈ ఆపరేషన్ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
మళ్ల విజయప్రసాద్ విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి వైసీపీ సమన్వయకర్తగా వ్యవహరిస్తుండగా, వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్గా కూడా ఉన్నారు. సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన ఆర్థిక అవకతవకలు, చట్ట ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ సోదాలపై ఈడీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దర్యాప్తు కొనసాగుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!