
బిజినెస్

విద్యావేత్త, వితరణశీలిగా విశేష గుర్తింపు పొందిన మాజీ గవర్నర్ డీవై పాటిల్ (జ్ఞానదేవ్ యశ్వంతరావ్ పాటిల్) 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు. విద్యా రంగం, ప్రజా సేవలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయి. దేశవ్యాప్తంగా అనేక విద్యాసంస్థలను స్థాపించి వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
డీవై పాటిల్ త్రిపుర, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు. సమాజానికి, విద్యా రంగానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా 1991లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆయన మరణంతో విద్యా, ప్రజా సేవా రంగాలు ఓ విశిష్ట వ్యక్తిత్వాన్ని కోల్పోయాయి. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!