
సినిమాలు

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గురువారం తెల్లవారుజామున పెను ప్రమాదం తృటిలో తప్పింది. స్టీల్ మెల్టింగ్ షాప్ (SMS-1)లోని ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్ వద్ద ల్యాడిల్ నుంచి భారీ మొత్తంలో ద్రవ ఉక్కు నేలపైకి చిందడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటన ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో చోటుచేసుకుంది.
అదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎలాంటి సిబ్బంది లేకపోవడంతో ఎవరికి గాయాలు కాలేదు. ద్రవ ఉక్కు లీక్ కావడంతో భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నప్పటికీ ప్రాణనష్టం తప్పింది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి, ప్రమాదానికి గల కారణాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ప్లాంట్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!