

ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం ‘ఇమ్మార్టల్’ ప్రస్తుతం మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో కాయదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేస్తూ, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు టీమ్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే తొలి పాటను విడుదల చేసిన చిత్రబృందం, తాజాగా రెండో సింగిల్కు సంబంధించిన అప్డేట్ను ప్రకటించింది. ‘షీ ఈజ్ మై’ అనే రెండో సింగిల్ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్పై అరుణ్ కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు. అశోక్ కుమార్ ధనశేఖరన్, విజయ్ కుమార్ ధనశేఖరన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!