
గాసిప్స్

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం కనిపిస్తున్నప్పటికీ, అవి ఇంకా పూర్తిగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించలేదు. దీంతో అనేక ప్రాంతాల్లో ఎండల ప్రభావం కొనసాగుతోంది.
ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, హనుమకొండ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రుతుపవనాలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు విస్తరించేందుకు మరో రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!