

యూడైస్ (UDISE) నివేదిక ఆధారంగా వెలువడిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్లో గత రెండేళ్లలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పేర్కొంది. ఈ కాలంలో 972 పాఠశాలలు మూతపడినట్లు, అందులో 778 ప్రభుత్వ మరియు 194 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 2023–24లో 40.50 లక్షల నుంచి 2025–26 నాటికి 34.93 లక్షలకు తగ్గిందని, దాదాపు 5.86 లక్షల మంది విద్యార్థులు తగ్గినట్లు పేర్కొంది.
అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45,000 నుంచి 44,222కు, ఎయిడెడ్ పాఠశాలలు 991 నుంచి 797కు తగ్గినట్లు నివేదికలో వెల్లడైంది. ఈ గణాంకాలపై రాజకీయ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యా ప్రమాణాలు పడిపోయాయని, సంక్షేమ పథకాల అమలులో లోపాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!