
జనరల్

గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి ఇంట్లో సుమారు కిలో బంగారు ఆభరణాలు, వజ్రాలు చోరీకి గురయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులైన నేపాలీ దంపతులను అరెస్ట్ చేశారు. యూపీ పోలీసుల సహకారంతో వారిని పట్టుకుని హైదరాబాద్కు తరలిస్తున్నారు.
వ్యాపారి కుటుంబం ముంబైకి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. తిరిగి వచ్చిన తర్వాత నగలు కనిపించకపోవడంతో ఫిర్యాదు చేశారు. నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి అనంతరం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు పంపనున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!