
జనరల్

విద్యార్థులపై జరిగినట్లు ఆరోపిస్తున్న దాడి, అయోధ్య చందా నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విపక్ష పార్టీలు పార్లమెంట్ ఆవరణలో వరుసగా 12వ రోజు నిరసనలు కొనసాగించాయి. మకర ద్వారం ఎదుట కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), డీఎంకే, సమాజ్వాదీ పార్టీతో పాటు ఇతర విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళన నిర్వహిస్తూ బీజేపీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నినాదాలు చేశారు.
నిరసనలో భాగంగా ఎంపీలు హుండీలో డబ్బులు వేస్తూ ప్రతీకాత్మకంగా తమ ఆందోళనను వ్యక్తం చేశారు. అయోధ్య చందా నిధుల నిర్వహణపై పారదర్శకత ఉండాలని, ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అధికార, విపక్షాల మధ్య రాజకీయ విమర్శలు మరింత వేడెక్కాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!