

హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ విల్లాలో భారీ చోరీ జరిగింది. ఓ వ్యాపారవేత్త ఇంటి నుంచి సుమారు 1 కిలో బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు మాయమైనట్లు గుర్తించారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాల్కు చెందిన భార్యాభర్తలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితమే పనిలో చేరిన ఈ దంపతులు కుటుంబ సభ్యుల నమ్మకాన్ని సంపాదించుకున్నట్లు సమాచారం. వ్యాపారవేత్త కుటుంబం ముంబై వెళ్లి ఆదివారం తిరిగి రాగానే ఆభరణాలు కనిపించకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇంట్లో తాళాలు పగులగొట్టిన ఆనవాళ్లు లేకపోవడంతో తొలుత వారు చెప్పకుండా వెళ్లిపోయారని భావించారు. అయితే పూజ గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసుతో పాటు మరికొన్ని విలువైన ఆభరణాలు కనిపించకపోవడంతో వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కీలక ఆధారాలు సేకరించి, నిఘా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!