

తెలుగు సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ది ప్యారడైజ్. నాని కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో కథానాయికగా కాయదు లోహర్ నటిస్తోంది. చిన్న సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ఇది కెరీర్లో కీలకమైన అవకాశం. అయితే సినిమా ప్రచార కార్యక్రమాల్లో మాత్రం కాయదు పెద్దగా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్లో జరిగిన పత్రికా సమావేశంతో పాటు తాజాగా చెన్నైలో నిర్వహించిన కార్యక్రమానికీ కాయదు హాజరు కాలేదు. ప్రస్తుతం ఆమె మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ సినిమాలో నటిస్తోంది. అయితే ప్యారడైజ్ కార్యక్రమాలకు ఆమెను చిత్రబృందం పిలవలేదా, లేక ఆమెే హాజరు కావడం లేదా అన్నది స్పష్టత లేదు. చెన్నై కార్యక్రమంలో కాయదు లేకపోవడంపై నానిని ప్రశ్నించగా, ఆమె తమిళ సినిమా షూటింగ్లో బిజీగా ఉందని, తమిళ ప్రేక్షకుల కోసం మంచి సినిమా చేయాలని అనుకుంటోందని చెప్పారు. అయితే ఈ సమాధానం కొందరికి పూర్తి స్పష్టత ఇవ్వలేదు. సినిమాలో తన పాత్రకు, ప్రచారానికి తగిన ప్రాధాన్యం దక్కలేదనే కారణంతో కాయదు అసంతృప్తిగా ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా విడుదలైన తర్వాత ఆమె పాత్రను చూస్తే ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!