
సినిమాలు

ప్రయాణికులకు చివరి మైలు కనెక్టివిటీని మరింత సులభతరం చేయడంతో పాటు ప్రైవేటు ట్రావెల్స్కు పోటీగా నిలిచేందుకు టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్లో కాంబో ఈ-ఆటో సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా బస్ టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఎలక్ట్రిక్ ఆటోను కూడా ఒకేసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించనుంది.
ఈ సేవ ద్వారా ఇంటి నుంచి బస్టాండ్కు లేదా బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్లేందుకు అవసరమైన ఈ-ఆటోను ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చు. బస్ టికెట్ ధరతో పాటు ఆటో ఛార్జీని కూడా ఒకేసారి టీజీఎస్ఆర్టీసీకి చెల్లించే విధంగా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. తొలి దశలో ఈ సేవలను హైదరాబాద్ నగరంలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!