
సినిమాలు

ఎమ్మెల్యే మదన్ మిత్రా రెబెల్స్ శిబిరంలో చేరినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీడియో సందేశం విడుదల చేశారు. పార్టీని విడిచి వెళ్లాలనుకునే వారు స్వేచ్ఛగా వెళ్లవచ్చని స్పష్టం చేసిన ఆమె, తృణమూల్ కాంగ్రెస్ బలంగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
తనకు గుండెపోటు రావాలని బీజేపీ కోరుకుంటోందని ఆరోపించిన మమతా బెనర్జీ, బీజేపీ రాజకీయ అంతాన్ని చూసే వరకు తాను బతికే ఉంటానని వ్యాఖ్యానించారు. లోక్సభ, రాజ్యసభల్లో తమ పార్టీకి ఇంకా 18 మంది ఎంపీలు ఉన్నారని గుర్తుచేస్తూ, ఎలాంటి రాజకీయ సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!