
జనరల్

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మూడో భాష (ఆర్3) బోధనకు సంబంధించిన కొత్త విధివిధానాలను విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం 9, 10 తరగతుల విద్యార్థులకు మూడో భాషకు సంబంధించిన ఇంటర్నల్ అసెస్మెంట్ తప్పనిసరిగా నిర్వహించాలి. పదో తరగతి ఉత్తీర్ణతకు ఈ అంతర్గత మూల్యాంకనంలో అర్హత సాధించడం తప్పనిసరి అని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.
అయితే మూడో భాష (ఆర్3) కోసం పదో తరగతిలో ప్రత్యేక బోర్డు పరీక్ష ఉండదని బోర్డు తెలిపింది. 2026–27 విద్యా సంవత్సరంలో 9వ తరగతిలో ప్రవేశించే విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలను అభ్యసించాల్సి ఉంటుందని పేర్కొంది. కొత్త విధానం అమలుతో జాతీయ విద్యా విధానం లక్ష్యాలకు అనుగుణంగా బహుభాషా విద్యకు మరింత ప్రాధాన్యం లభించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!