
షోస్

అలనాటి ప్రముఖ నటి షావుకారు జానకి 94 ఏళ్ల వయసులో కన్నుమూయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సినీ రంగానికి షావుకారు జానకి అందించిన సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు.
సుదీర్ఘ సినీ ప్రస్థానంలో షావుకారు జానకి 400కు పైగా చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆమె.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు జీవం పోశారని అన్నారు.
షావుకారు జానకి భౌతికంగా మనకు దూరమైనప్పటికీ, ఆమె నటించిన పాత్రల ద్వారా ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చంద్రబాబు తెలిపారు. ఆమె ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!