

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (జూన్ 10) రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న ఆయన, ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
అనంతరం జూన్ 11న రాష్ట్రపతి భవన్లో నిర్వహించే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి సీఎం హాజరవుతారు. ఉదయం 9:15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో రాష్ట్రాల అభివృద్ధి, ఆర్థిక విధానాలు, కేంద్ర-రాష్ట్ర సమన్వయం వంటి అంశాలపై చర్చించనున్నారు. సమావేశాలు ముగిసిన తర్వాత అదే రోజు రాత్రి ఆయన అమరావతికి తిరిగి చేరుకోనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!