

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్తో కలిసి ముసునూరులో దేశంలోనే తొలి నాన్-జీఎంఓ పాప్కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించనున్నారు. రైతుల పంటలకు విలువ జోడించడం, ప్రాసెసింగ్, బ్రాండింగ్ ద్వారా మార్కెట్కు తరలించడం వంటి చర్యలతో వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే దిశగా ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది.
గోర్మే పాప్కార్నికా సంస్థ దేశవ్యాప్తంగా వేల ఎకరాల్లో పాప్కార్న్ మెయిజ్ సాగు చేస్తున్న వేలాది మంది రైతులతో భాగస్వామ్యంగా పనిచేస్తోంది. ముసునూరులోని సంస్థ ప్లాంట్ ఆసియాలోని ప్రధాన పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రాల్లో ఒకటిగా ఉంది. దేశవ్యాప్తంగా వేలాది సినిమా థియేటర్లకు పాప్కార్న్ సరఫరా చేస్తున్న సంస్థ.. సోమవారం కొత్త నాన్-జీఎంఓ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!