
గాసిప్స్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్లోని కొండాపూర్లో ఆయనను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు, తదుపరి విచారణ కోసం ఈడీ కార్యాలయానికి తరలించారు.
ఏపీ లిక్కర్ రవాణాలో అక్రమాలకు పాల్పడ్డారని కారుమూరిపై ఆరోపణలు ఉన్నాయని ఈడీ పేర్కొంది. కాంట్రాక్టుల ద్వారా రూ.28 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు, టెండర్ నిబంధనలను మార్చి అనుకూల కంపెనీలకు కాంట్రాక్టులు దక్కేలా చేశారని ఆరోపించింది. ఈ లిక్కర్ కుంభకోణం వల్ల ప్రభుత్వానికి రూ.195.33 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!