
క్రీడలు

ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో ప్రకటనలు, ప్రచార కార్యక్రమాల కోసం రూ.6,811.94 కోట్లు ఖర్చు చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ వ్యయం రోజుకు సగటున రూ.2.32 కోట్లకు సమానమని, ఇది కేంద్ర ప్రభుత్వ సగటు ప్రచార ఖర్చుకంటే ఎక్కువేనని పేర్కొంది. ప్రజాధన వినియోగం, ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఈ ఆరోపణలు మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి.
భారీ స్థాయిలో ప్రకటనలు, మీడియా ప్రచారానికి ఖర్చు చేయడం ద్వారా ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ప్రజల్లో ఒక భావనను సృష్టించే ప్రయత్నం జరిగిందని కాంగ్రెస్ విమర్శించింది. సామాజిక మాధ్యమాలు, ప్రచార వ్యవస్థల ద్వారా వాస్తవ పరిస్థితుల కంటే ఇమేజ్ బిల్డింగ్కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించింది. అయితే ఈ విమర్శలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!