

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసి లామినేట్ చేసిన 1.05 కోట్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ కార్డుల పంపిణీని ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనుంది. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి కార్యక్రమం ప్రారంభం కానుండగా, అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా యంత్రాంగం, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉదయం, రాజ్భవన్లో జరిగే "అట్ హోమ్" కార్యక్రమం సాయంత్రం ఉండటంతో రేషన్ కార్డుల పంపిణీని మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల ధ్రువీకరణ, కార్డుల ముద్రణ, రవాణా, వేదికల ఏర్పాటు, మీడియా కవరేజ్, నివేదికల సమర్పణ వంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి కొత్తగా అర్హత పొందిన కుటుంబాలకు సంక్షేమ ప్రయోజనాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!