
జనరల్

అయోధ్య రామమందిర విరాళాల కేసు దర్యాప్తులో ఈడీ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కేసుపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ అయోధ్య పోలీసులు ఈడీకి లేఖ రాశారు. ఇదే సమయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు దర్యాప్తు కొనసాగించేందుకు మరో 15 రోజుల గడువును మంజూరు చేశారు.
కేసులోని అన్ని అంశాలపై విస్తృత విచారణ జరిపేందుకు సిట్కు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నిందితులు న్యాయస్థానపు కస్టడీలో ఉండగా, ఆర్థిక లావాదేవీలు, ఇతర ఆధారాలపై అధికారులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!