

పెట్టుబడి మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) 41 మంది చైనా పౌరులను అదుపులోకి తీసుకుంది. ఇస్లామాబాద్లోని గుల్బర్గ్ గ్రీన్స్లో ఉన్న స్పార్కో ప్లాజాలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 258 మంది విదేశీ పౌరులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. చైనా, వియత్నాం, ఇండోనేషియాకు చెందిన కొందరు వ్యక్తులు అక్రమ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఎఫ్ఐఏ డైరెక్టర్ జనరల్ ఉస్మాన్ అన్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుల్లో ఎక్కువ మంది మొబైల్ యాప్లు, ఆన్లైన్ వేదికల్లో మహిళలుగా పరిచయం చేసుకుని పాకిస్థాన్ పౌరులతో సంబంధాలు ఏర్పరచుకునేవారు. అనంతరం బాధితుల నమ్మకాన్ని సంపాదించి, అధిక లాభాలు వస్తాయని చెప్పి నకిలీ వ్యాపార, పెట్టుబడి పథకాల్లో డబ్బులు పెట్టించేవారని ఆరోపణలు ఉన్నాయి. నగదు బదిలీ అయిన తర్వాత బాధితులతో సంబంధాలు తెంచుకునేవారని తెలిపారు. ఈ వ్యవహారంలో విదేశీయుల చట్టం-1946లోని సెక్షన్ 14 కింద కేసు నమోదు చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!