
గాసిప్స్

కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి బెంగళూరు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న రేవణ్ణకు జైలులో వీఐపీ ట్రీట్మెంట్ అందుతున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రేవణ్ణ బ్యారక్లో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లభించినట్లు అధికారులు తెలిపారు.
తనిఖీల్లో మొబైల్ ఫోన్తో పాటు పెన్డ్రైవ్, ఛార్జర్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, జైలులోకి నిషేధిత వస్తువులు ఎలా చేరాయన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి జైలు అధికారిపై సస్పెన్షన్ చర్యలు కూడా తీసుకున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!