
గాసిప్స్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపించారు. దేవాలయాలకు వెళ్లిన విషయాన్ని క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలుగా చిత్రీకరిస్తూ చేసిన ఆరోపణలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ పరువు నష్టం కేసులు వేస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు.
హరీశ్ రావు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగానే నిరాధార ఆరోపణలు చేశారని ఆయన తరఫు న్యాయవాది నోటీసుల్లో పేర్కొన్నారు. చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, సంబంధిత వార్తలు, వీడియోలు, పోస్టులను తొలగించాలని, అదే వేదికల ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే సివిల్, క్రిమినల్ న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!