
జనరల్

మన దేశంలో 6.60 లక్షలకు పైగా ఆలయాలు ఉన్నట్లు ఓ అధ్యయన నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆలయాలు భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన పరిశీలిస్తే గోవా, తమిళనాడు రాష్ట్రాల్లో ఆలయాల సాంద్రత అధికంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
అలాగే క్రీస్తుశకం 800 నుంచి 1200 మధ్యకాలంలోనే అత్యధిక సంఖ్యలో ఆలయాలు నిర్మితమైనట్లు అధ్యయనం వెల్లడించింది. ఆ కాలంలో అభివృద్ధి చెందిన ఆలయ నిర్మాణ శైలి, శిల్పకళ, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ఇవి నేటికీ సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. భారతీయ సంస్కృతి, భక్తి సంప్రదాయాల పరిరక్షణలో ఆలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!