

భారతీయ పారిశ్రామికవేత్త, హాట్మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా ఆగస్టు 8న చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. “నలుగురు గుజరాతీలు దేశ నిర్మాణం కంటే డబ్బు సంపాదించడంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు” అని ఆయన పేర్కొన్నారు. అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేశారో వెల్లడించలేదు. దీంతో ఈ వ్యాఖ్యపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
ఈ చర్చ క్రమంగా భారత్లో ఆర్థిక శక్తి కేంద్రీకరణ, భారీ మౌలిక వసతుల ప్రైవేట్ యాజమాన్యం, పెద్ద కార్పొరేట్ సంస్థల ప్రభావం వంటి అంశాలపైకి వెళ్లింది. ముంబై విమానాశ్రయం వంటి కీలక మౌలిక వసతులపై కూడా ఓ నెటిజన్ ప్రస్తావిస్తూ పెద్ద వ్యాపార సంస్థల ఆధిపత్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. భాటియా వ్యాఖ్యకు కొందరు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ఇది సాధారణీకరణగా ఉందని, ఆయన ఉద్దేశించిన వ్యక్తుల వివరాలు స్పష్టం చేయాలని కోరుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!