
క్రీడలు

ముద్రగడ వ్యక్తిత్వం, ఆత్మాభిమానానికి నిలువుటద్దమని ఆయన కుమారులు బాలు, గిరిబాబు పేర్కొన్నారు. తన మరణాంతరం చేపట్టాల్సిన చర్యలపై ముద్రగడ ముందుగానే స్పష్టమైన సూచనలు ఇచ్చారని తెలిపారు. ఆయన నిర్ణయాల ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించామని, ప్రభుత్వ లాంఛనాలు వద్దని ఆయన స్పష్టం చేయడంతో అధికారిక గౌరవాలను తిరస్కరించామని వెల్లడించారు. ఈ కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక బార్లపూడి క్రాంతి కుటుంబంతో తమకు కొన్నేళ్లుగా సంబంధాలు లేవని, ఆమె కడచూపుకు రాకూడదన్నది ముద్రగడ స్వయానా నిర్ణయమని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో తమను మానసికంగా బాధించే విధంగా కథనాలు ప్రసారం చేయవద్దని మీడియాను వేడుకున్నారు. కుటుంబ గౌరవం, వ్యక్తిగత భావోద్వేగాలను గౌరవించాలని వారు విజ్ఞప్తి చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!