

భారత్–యునైటెడ్ కింగ్డమ్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సిఇటిఏ) ద్వారా తెలంగాణకు గరిష్ఠ ప్రయోజనం కలిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ఒప్పందంతో దేశం నుంచి ఎగుమతి అయ్యే 99 శాతం పారిశ్రామిక ఉత్పత్తులపై యుకె సుంకాలను తొలగించిందని ఆయన పేర్కొన్నారు. యుకె డిప్యూటీ ట్రేడ్ కమిషనర్ చంద్రు కె అయ్యర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమైన మంత్రి, ఇరు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణాలో పారిశ్రామిక ఉత్పత్తి, లైఫ్ సైన్సెస్, ఏవియేషన్, డిఫెన్స్, ఐటి, సెమికండక్టర్స్ వంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి యుకెకు రూ.3,553 కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయని, కొత్త ఒప్పందంతో ఇవి మరింత పెరిగే అవకాశముందని వివరించారు. ఫార్మా, వ్యాక్సిన్, ఏవియేషన్ రంగాల్లో తెలంగాణా అగ్రస్థానంలో ఉందని, అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నాయని మంత్రి తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!