
సినిమాలు

ఈ20 పెట్రోల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టాలని భావించిన రాజకీయ విశ్లేషకుడు తహసీన్ పూనావాలాను ఢిల్లీ పోలీసులు గృహ నిర్బంధం చేసినట్లు సమాచారం. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేశారని తహసీన్ ఆరోపించారు. తొలుత వాహన ర్యాలీ నిర్వహించాలని ఆయన భావించగా, పోలీసులు అనుమతి నిరాకరించారు.
అనంతరం గాంధీ స్మృతికి కాలినడకన వెళ్లి మౌన దీక్ష చేపట్టాలని తహసీన్ పూనావాలా నిర్ణయించుకున్నారు. అయితే నిరసనకు ముందే పోలీసులు ఆయనను గృహ నిర్బంధంలో ఉంచినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!