

ప్రముఖ నటి షావుకారు జానకి మృతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు షావుకారు జానకి మృతి తీరని లోటని పేర్కొన్నారు.
ఏడు దశాబ్దాలకు పైగా సాగిన షావుకారు జానకి సినీ ప్రస్థానాన్ని వైఎస్ జగన్ గుర్తుచేసుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి, ఎన్నో తరాల ప్రేక్షకుల హృదయాల్లో ఆమె చెరగని ముద్ర వేశారని తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి దిగ్గజ నటుల సరసన కథానాయికగా నటించిన ఆమె.. ఆ తర్వాత తల్లి, అమ్మమ్మ, నానమ్మ వంటి విభిన్న పాత్రల్లోనూ తన సహజ నటనతో మెప్పించారని పేర్కొన్నారు.
సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని జగన్ గుర్తుచేశారు. నంది అవార్డులతో పాటు అనేక పురస్కారాలు ఆమె ప్రతిభకు దక్కిన గౌరవాలని అన్నారు. షావుకారు జానకి కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ పరిశ్రమకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!