

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకా’ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే చిత్రీకరణ ఇంకా పూర్తికాకపోవడంతో విడుదల తేదీపై మేకర్స్ ఎలాంటి తొందరపడడం లేదని తెలుస్తోంది. మరో 3 నెలలకు పైగా షూటింగ్ మిగిలి ఉండటంతో పాటు అనంతర నిర్మాణ పనులకు కూడా సమయం అవసరమవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీపికా పదుకొణెకు సంబంధించిన సన్నివేశాలను ముందుగా పూర్తిచేసేలా చిత్రబృందం ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ క్యామియో చేస్తున్నారనే ప్రచారం కొనసాగుతున్నప్పటికీ, అందులో నిజం లేదని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అలాగే అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కలయికలో రానున్న ఏఏ23 చిత్రంపై వస్తున్న వార్తలకూ తాజాగా స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. షాహిద్ కపూర్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం కేవలం ఊహాగానమేనని సమాచారం. ఆయన పేరు పరిశీలనలో కూడా లేదని చెబుతున్నారు. అలాగే ‘కూలీ’లో ప్రత్యేక గీతంలో కనిపించిన పూజా హెగ్డేను ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేశారనే వార్తల్లోనూ వాస్తవం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ ‘డిసి’ ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా, మరో నెలలో ఏఏ23కు సంబంధించిన పనులు మరింత వేగం అందుకునే అవకాశముందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!