

నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నేతల అరెస్టును ఖండిస్తూ, నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏఐసీసీ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి.
తెలంగాణలో పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు. కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టగా, హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఇందిరమ్మ విగ్రహం వద్ద పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఆందోళన జరగగా, హైదరాబాద్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!