

మసాలా కల్తీకి పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో నిందితులు స్టేషన్ బెయిల్పై సులభంగా విడుదలవుతున్నారని, దీనివల్ల కల్తీ నేరాలు పూర్తిగా అరికట్టలేకపోతున్నామని పేర్కొన్నారు. కల్తీ నేరస్తులపై నమోదయ్యే చట్టపరమైన సెక్షన్లను కఠినతరం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్ట్ అమలు చేయాలని, వారి వివరాలను బహిర్గతం చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని రాజా సింగ్ కోరారు. అలాగే హైదరాబాద్లోని కోటి ప్రాంతంలో డూప్లికేట్ ఎలక్ట్రికల్ వైర్లు, జగదీష్ మార్కెట్లో నకిలీ మొబైల్ ఫోన్లు విక్రయిస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించి కల్తీ నేరస్తులపై కఠిన చట్టాలు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!