

పేపర్ లీక్ నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు నోయిడాలో ఒక బాలికపై కేసు నమోదు అయ్యింది. తన తప్పును గ్రహించిన ఆ బాలిక ప్రధానికి క్షమాపణలు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆమె తల్లి స్పందిస్తూ ప్రధాని చూపిన పెద్దమనసుకు కృతజ్ఞతలు తెలిపారు. తన కుమార్తెకు క్షమించడం ద్వారా కొత్త జీవితం ఇచ్చినట్టేనని, ఆమె పుట్టినరోజున ఇది గొప్ప కానుకగా నిలిచిందని పేర్కొన్నారు.
ఇక మైనర్లపై సోషల్ మీడియా వినియోగం, నిరసనల్లో పాల్గొనడంపై నియంత్రణలు తీసుకురావాలని తల్లి కేంద్రాన్ని కోరారు. ఎఫ్ఐఆర్లో తన కుమార్తె వయసును తప్పుగా నమోదు చేశారని, ఆమె వయసు కేవలం 15 సంవత్సరాలేనని తెలిపారు. కేసును రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ, క్షమాపణ చెప్పినా సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. నిరసనల సమయంలో ఇతరుల ప్రభావంతో తాను తప్పు చేశానని బాలిక మరోసారి క్షమాపణలు తెలిపింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!