
గాసిప్స్

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. తాను చిన్నప్పటి నుంచి ఫుట్బాల్కు వీరాభిమాని అని పేర్కొంటూ, ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్కు వచ్చి తెలంగాణ చిన్నారులతో కలిసి మైదానంలో అడుగుపెట్టిన రోజు తనకు ఎంతో ప్రత్యేకమైందని గుర్తు చేసుకున్నారు.
ఫిఫా ప్రపంచకప్కు తన మద్దతు కేవలం అభిమానంతో మాత్రమే కాదని, భారత ఫుట్బాల్ అభివృద్ధిపై ఉన్న దూరదృష్టితోనని సీఎం తెలిపారు. ఒకరోజు భారత ఫుట్బాల్ జట్టు ప్రపంచకప్ ఫైనల్లో ఆడటమే కాకుండా ఆ టోర్నీకి ఆతిథ్యం కూడా ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ జట్టులో పలువురు భవిష్యత్ స్టార్ ఆటగాళ్లు తెలంగాణ నుంచే వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!