
జనరల్

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో వరుస సంచలనాలు నమోదవుతున్నాయి. మహిళల క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ అరినా సబలెంక 6-3, 5-7, 0-6 తేడాతో రష్యాకు చెందిన 25వ సీడ్ డయానా ష్నైడర్ చేతిలో పరాజయం పాలైంది. మరో మ్యాచ్లో పోలెండ్కు చెందిన క్వాలిఫయర్ మాయా ఖాలీన్స్కా 7-6(3), 6-3తో అన్నా కలిన్స్కయాను ఓడించి తొలిసారి గ్రాండ్స్లామ్ సెమీఫైనల్కు అర్హత సాధించింది.
గురువారం జరిగే మహిళల సెమీఫైనల్లో డయానా ష్నైడర్, మాయా ఖాలీన్స్కా తలపడనున్నారు. పురుషుల విభాగంలో చెక్ రిపబ్లిక్కు చెందిన మెన్సిక్ 6-4, 6-3, 7-6(3)తో బ్రెజిల్ ఆటగాడు జోవో ఫోన్సెకాను ఓడించి సెమీస్కు చేరాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత ఆటగాడు శ్రీరామ్ బాలాజీ, మార్సెల్లో డిమోలైనర్ జోడీ పరాజయం పాలవడంతో వారి ప్రయాణం ముగిసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!