
జనరల్

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం వేగంగా పెరుగుతోంది. 2026 మే నెలలో ఈవీ రిటైల్ సేల్స్ 9.25 శాతానికి చేరుకోగా, 2025 మేలో ఇది 6.11 శాతంగా నమోదైంది. పర్యావరణహిత రవాణా మార్గాలపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి ఈ వృద్ధికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
విభిన్న ఈవీ విభాగాల్లో కూడా గణనీయమైన వృద్ధి నమోదైంది. ఎలక్ట్రిక్ రెండు చక్రాల గూడ్స్ వాహనాలు 25.23%, మూడు చక్రాల గూడ్స్ వాహనాలు 64.45%, ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలు 25.80%, కమర్షియల్ ఈవీలు 2.86%, కమర్షియల్ ప్యాసింజర్ ఈవీలు 6.63% వృద్ధిని నమోదు చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు ఇంధన పొదుపు, పర్యావరణహిత వాహనాల వైపు మొగ్గు చూపుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!