

ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విశాఖపట్నంలో ఐబీఎం ఏర్పాటు చేసిన 'కన్సల్టింగ్ ఫ్యూచర్ నౌ సెంటర్'ను ఐబీఎం ఇండియా, సౌత్ ఏసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఖాతాదారులకు కన్సల్టింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ ట్రాన్స్ఫర్మేషన్ సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్పై ఐబీఎం చూపుతున్న విశ్వాసాన్ని అభినందించారు. విశాఖపట్నాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో దేశంలోనే అగ్రగామి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఐబీఎంతో కలిసి పనిచేస్తుందని చెప్పారు. ఐబీఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్, 'వికసిత్ భారత్-2047' లక్ష్య సాధనలో భారత్ డిజిటల్ ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశముందని పేర్కొన్నారు. స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని మేనేజింగ్ పార్టనర్ ఉషా శ్రీకాంత్ తెలిపారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!