

భారత్పే సహ వ్యవస్థాపకుడు అశ్నీర్ గ్రోవర్ యూపీఐపై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. గత 14 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా భారత్ టెక్నాలజీ రంగానికి గుర్తింపు తెచ్చిన ప్రధాన విజయంగా యూపీఐ నిలిచిందని ఆయన పేర్కొన్నారు. యూపీఐ లావాదేవీల సంఖ్య, వినియోగం, బ్యాంకుల భాగస్వామ్యం, అంతర్జాతీయంగా దాని విస్తరణను ప్రస్తావిస్తూ.. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ దేశానికి కీలకమైన సాంకేతిక విజయమని అభిప్రాయపడ్డారు.
యూపీఐ లావాదేవీలపై ఛార్జీల విధింపు చిన్న మొత్తాల డిజిటల్ చెల్లింపులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాన్ని కూడా గ్రోవర్ ప్రశ్నించారు. యూపీఐపై విధించే ఏ రుసుమైనా చివరికి వినియోగదారులపై భారం పడే అవకాశం ఉందని ఆయన వాదించారు. యూపీఐ ప్రాధాన్యాన్ని తగ్గించే చర్యలు రాజకీయంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ డిజిటల్ చెల్లింపుల భవిష్యత్తు, యూపీఐ ఆర్థిక స్థిరత్వంపై చర్చ మళ్లీ ఊపందుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!