

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం విక్రయాలకు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో త్వరలో 150 ఎంఎల్, 200 ఎంఎల్ పరిమాణాల్లో కొత్త మద్యం బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం విక్రయిస్తున్న 90, 180, 375, 750, 1000 ఎంఎల్ బాటిళ్లకు అదనంగా ఈ కొత్త సైజులను ప్రవేశపెట్టేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. మద్యం సరఫరా సంస్థల ప్రతిపాదనల మేరకు ఐఎంఎఫ్ఎల్ నిబంధనల్లో సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త విధానం ప్రకారం ఒక కేసులో 150 ఎంఎల్ బాటిళ్లు 60, 200 ఎంఎల్ బాటిళ్లు 45 ఉండనున్నాయి.
ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్ల వద్ద మద్యం బ్రాండ్లకు సంబంధించిన బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీలను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే ఉన్న ప్రకటన బోర్డులను తొలగించాలని యాజమాన్యాలకు సూచించారు. మద్యం బ్రాండ్లను పరోక్షంగా ప్రచారం చేసే విధానాలను అరికట్టడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!