
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై ప్రాజెక్టులో జరుగుతున్న పనులపై సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రధాన డ్యామ్తో పాటు జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను కూడా సీఎం పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ జాతీయ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో సీఎం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!