
సినిమాలు

యూట్యూబర్ సౌరవ్ జోషి చేసిన మైలేజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెర్సిడెస్-బెంజ్ ఇండియా అధికారికంగా స్పందించింది. తమ అన్ని BS-VI పెట్రోల్ వాహనాలు E20 ఇంధనానికి పూర్తిగా అనుకూలమైనవేనని, సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అన్ని ధ్రువీకరణలు కూడా పొందినట్లు కంపెనీ స్పష్టం చేసింది.
E20 ఇంధనం వల్లే వాహనాల మైలేజ్ భారీగా తగ్గిందనే ప్రచారంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. అయితే నగర ట్రాఫిక్లో నమోదయ్యే తాత్కాలిక ఫ్యూయల్ ఎకానమీని వాహనం మొత్తం పనితీరుకు ప్రమాణంగా పరిగణించడం సరైంది కాదని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెర్సిడెస్ తాజా ప్రకటనతో E20 ఇంధనంపై నెలకొన్న అనేక సందేహాలకు స్పష్టత లభించిందని ఆటో రంగ వర్గాలు పేర్కొంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!