
సినిమాలు

ప్రముఖ గాయని పి. సుశీల, లెజెండరీ సింగర్ ఎస్. జానకి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకమ్మ లేని సంగీత ప్రపంచాన్ని ఊహించలేమని, ఆమె గాత్రం, సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. భారతీయ సంగీతానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
తమ కెరీర్ ప్రారంభ రోజుల్లో కొందరు స్వార్థపరులు తమ మధ్య లేనిపోని విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించారని సుశీల ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో తమను దూరం చేయాలని చూసిన వారి కళ్లు ఇప్పుడు చల్లబడ్డాయంటూ భావోద్వేగంగా స్పందిస్తూ జానకికి కన్నీటి నివాళి అర్పించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!