

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ రెండేళ్ల ప్రగతి నివేదికను విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలకు తగిన ప్రాధాన్యం లభించలేదని, దేవాలయాలు సమాజంలో కీలక భాగమనే విషయాన్ని విస్మరించారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. రెండేళ్లలో దేవాదాయ శాఖ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలోని 6,137 దేవాలయాలకు అమలవుతున్న ధూపదీప నైవేద్య పథకానికి వార్షిక వ్యయాన్ని రూ.35 కోట్ల నుంచి రూ.73 కోట్లకు పెంచినట్లు వెల్లడించారు. నిర్లక్ష్యానికి గురైన 692 పురాతన ఆలయాల అభివృద్ధికి రూ.813 కోట్ల సర్వశ్రేయోనిధి నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. టీటీడీ సహకారంతో రూ.750 కోట్ల వ్యయంతో 5,000 శ్రీవాణి భజన మందిరాల నిర్మాణ లక్ష్యాన్ని నిర్దేశించగా, ఇప్పటికే 1,270 భజన మందిరాలకు అనుమతులు ఇచ్చి రూ.267 కోట్లను కేటాయించినట్లు వివరించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!