
టెక్నాలజీ

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వివరాల విషయంలో హైదరాబాద్ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి స్కూల్ తరగతుల వారీగా వసూలు చేసే ఫీజుల వివరాలను ఎడ్యుకేషన్ పోర్టల్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని సూచించింది. అలాగే పాఠశాల ప్రాంగణంలో ఫీజుల పట్టికను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించింది.

ఫీజుల వివరాలను ప్రదర్శించని, పోర్టల్లో సమాచారం నమోదు చేయని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని విద్యాశాఖ తెలిపింది. నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల వసూళ్లపై మరింత పారదర్శకత తీసుకురావడంపై అధికారులు దృష్టి సారించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!